సిరీస్ కివీస్ కైవసం : రెండో టెస్ట్ లో భారత్ ఓటమి

సిరీస్ కివీస్ కైవసం : రెండో టెస్ట్ లో భారత్ ఓటమి

వరుస పరాజయాలు టీమిండియాను వెంటాడుతున్నాయి. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులోనూ భారత్ పరాజయం పాలైంది. దీంతో 2 టెస్టుల సిరీస్ ను కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 242 రన్స్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో 124 రన్స్ మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235 రన్స్, రెండో ఇన్నింగ్స్ లో 36 ఓవర్లకు 132/3 రన్స్ చేసి విక్టరీ కొట్టింది.