- సీఈఓ వికాస్ రాజ్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ ఎన్నికలకు దాఖలైన మూడు నామినేషన్లను తిరస్కరించామని సీఈఓ వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం నుంచి ఏప్రిల్2న మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా ఆ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్లను దాఖలు చేసే గడువు గురువారంతో ముగిసింది. రిటర్నింగ్ ఆఫీసర్, అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి శుక్రవారం నామినేషన్లను పరిశీలించారు. ఒక్కో సెట్నామినేషన్ను ప్రతిపాదిస్తూ పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది.
శ్రమజీవి పార్టీ అభ్యర్థులు కోయల్కర్ భోజ్ రాజ్, జాజుల భాస్కర్, ఇండిపెండెంట్అభ్యర్థి కిరణ్ రాథోడ్ల నామినేషన్లను ప్రతిపాదిస్తూ ఒక్క ఎమ్మెల్యే కూడా సంతకం చేయలేదు. దీంతో ఆ ముగ్గురి నామినేషన్లను తిరస్కరించారు. కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లను ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 20న ముగియనుంది.