బీజీపీ సమావేశాలను సక్సెస్ చేయడానికి 30 కమిటీలు

బీజీపీ సమావేశాలను సక్సెస్ చేయడానికి 30 కమిటీలు

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 2, 3 తేదీల్లో హైటెక్స్ నోవాటెల్​లో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సక్సెస్ చేయడానికి 30 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రొటోకాల్, ఆహ్వాన, స్వాగత, ఆహార, నగర సుందరీకరణ, రవాణా, మీడియా సహా  మొత్తం 30 కమిటీల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్  రాష్ట్ర నేతలకు సూచించారు. శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీస్​లో  నేతలకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రధాని మోడీ రోడ్డు షోకు భారీ జన సమీకరణ చేయాలన్నారు. బీజేపీ పాలిత సీఎంలు, కేంద్ర మంత్రుల సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకునేలా కార్యక్రమాలకు ప్లాన్​ చేయాలన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆయా రాష్ట్రాల వారితో అక్కడి నుంచి వస్తున్న సీఎంలు, కేంద్ర మంత్రులతో ప్రత్యేక భేటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై ఇప్పటికే జూమ్ మీటింగ్​ ద్వారా బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేశారు.