30 వేల 212 టెస్టులు.. 450 కేసులు

 30 వేల 212 టెస్టులు.. 450 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవలే వేల సంఖ్యకు చేరువ కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. ఇప్పుడు కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తాజాగా... గత 24 గంటల్లో 450 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. గురువారం ఈ సంఖ్య 435గా ఉంది. ఒక్కరోజులో 476 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 8, 24, 360 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.17 శాతంగా ఉందని, మొత్తం 30 వేల 212 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది. 

ఏ జిల్లాలో ఎన్ని కేసులు :  ఆదిలాబాద్ 05. భద్రాద్రి కొత్తగూడెం 05, హైదరాబాద్ 220, జగిత్యాల 08, జనగాం 09, జయశంకర్ భూపాలపల్లి 00. జోగులాంబ గద్వాల 07, కామారెడ్డి 02, కరీంనగర్ 10, ఖమ్మం 11, కొమరంభీం ఆసిఫాబాద్ 02, మహబూబ్ నగర్ 10, మహబూబాబాద్ 05, మంచిర్యాల 07, మెదక్ 07, మేడ్చల్ మల్కాజ్ గిరి 25, ములుగు 00, నాగర్ కర్నూలు 05, నల్గొండ 11, నారాయణపేట 06, నిర్మల్ 00, నిజామాబాద్ 08, పెద్దపల్లి 06, రాజన్న సిరిసిల్ల 06, రంగారెడ్డి 30, సంగారెడ్డి 10, సిద్ధిపేట 05, సూర్యాపేట 06, వికారాబాద్ 06, వనపర్తి 03, వరంగల్ రూరల్ 01, హన్మకొండ 06, యాదాద్రి భువనగరి 06. మొత్తం - 450