
గండిపేట్,వెలుగు : ఇంట్లో దొంగలు పడి 30 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పాండురంగానగర్ కు చెందిన అశోక్ బిరాదర్ ప్రైవేటు ఉద్యోగి. శుక్రవారం డ్యూటీకి వెళ్లగా.. ఆయన భార్య రేష్మ ఇంటికి తాళం వేసి గుడికి వెళ్లింది. మధ్యాహ్నం స్కూల్ నుంచి పిల్లలు వస్తారని, ఇంటి తాళాలు పక్కంటి వాళ్లకు ఇచ్చింది. పిల్లలు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని 30 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. అశోక్ వెంటనే అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.