
తిరువనంతపురం: ఆటో తోలితే వచ్చే సంపాదన అంతంత మాత్రంగానే ఉండడం తో ఫారెన్ వెళ్లి డబ్బు కూడవెట్టాలని అనుకున్నడో ఆటోడ్రైవర్.. తెలిసినోళ్ల సాయంతో చెఫ్ ఉద్యోగం సంపాయించి, మలేసియా వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలెట్టిండు. వీసా, టికెట్ ఖర్చుల కోసం బ్యాంకు లోనుకు అప్లై చేసిండు. శనివారం లోన్ కూడా సాంక్షనైంది. ఈలోపే ఓనమ్ బంపర్ లాటరీ రూపంలో అదృష్టం తలుపుతట్టిందా కేరళ డ్రైవర్కు.. ఏకంగా రూ.25 కోట్ల ప్రైజ్మనీ సొంతమైంది. శ్రీవరాహం జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్ అనూప్ మలేసియాలో చెఫ్గా వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్నడు. వీసా ఏర్పాట్లు చేసుకుంటుండు. తరచుగా లాటరీ టికెట్లు కొంటూ అనూప్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండేవాడు. 22 ఏండ్లుగా కొంటున్నా ఒక్కసారి కూడా లాటరీ తగల్లే.. దీంతో ఫలితాలు చూడడమే మానేసిండు కానీ టికెట్లు కొనడం మానలే. ఎప్పటిలాగే శనివారం ఓ లాటరీ టికెట్ కొన్నడు. ముందో టికెట్ తీసుకున్నా.. నెంబర్ నచ్చలేదని మార్చేసి వేరే టికెట్ తీసుకున్నడు. మార్చేయడమే మంచిదైందని, ఆ నెంబర్కు బంపర్ ప్రైజ్ తగిలిందని అనూప్ చెప్పాడు.