కేరళ డ్రైవర్​కు వరించిన అదృష్టం

కేరళ డ్రైవర్​కు వరించిన అదృష్టం

తిరువనంతపురం: ఆటో తోలితే వచ్చే సంపాదన అంతంత మాత్రంగానే ఉండడం తో ఫారెన్​ వెళ్లి డబ్బు కూడవెట్టాలని అనుకున్నడో ఆటోడ్రైవర్.. తెలిసినోళ్ల సాయంతో చెఫ్ ఉద్యోగం సంపాయించి, మలేసియా వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలెట్టిండు. వీసా, టికెట్​ ఖర్చుల కోసం బ్యాంకు లోనుకు అప్లై చేసిండు. శనివారం లోన్​ కూడా సాంక్షనైంది. ఈలోపే ఓనమ్​ బంపర్​ లాటరీ రూపంలో అదృష్టం తలుపుతట్టిందా కేరళ డ్రైవర్​కు.. ఏకంగా రూ.25 కోట్ల  ప్రైజ్​మనీ సొంతమైంది. శ్రీవరాహం జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్ అనూప్ మలేసియాలో చెఫ్​గా వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్నడు. వీసా ఏర్పాట్లు చేసుకుంటుండు. తరచుగా లాటరీ టికెట్లు కొంటూ అనూప్​ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండేవాడు. 22 ఏండ్లుగా కొంటున్నా ఒక్కసారి కూడా లాటరీ తగల్లే.. దీంతో ఫలితాలు చూడడమే మానేసిండు కానీ టికెట్లు కొనడం మానలే. ఎప్పటిలాగే శనివారం ఓ లాటరీ టికెట్​ కొన్నడు. ముందో టికెట్ తీసుకున్నా.. నెంబర్​ నచ్చలేదని మార్చేసి వేరే టికెట్​ తీసుకున్నడు. మార్చేయడమే మంచిదైందని, ఆ నెంబర్​కు బంపర్​ ప్రైజ్​ తగిలిందని అనూప్​ చెప్పాడు.