- డీఏ జగ్వా స్కీంతో జిల్లాలో 3,159 మందికి లబ్ధి
- ఏజెన్సీలోని గిరిజనుల ఇండ్లకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్స్
- మీటర్, స్విచ్ బోర్డు, ప్లగ్ పాయింట్ అన్నీ ఉచితమే
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గిరిజన కుటుంబానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్ (DAJGUA) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో జిల్లాలో 3,159 మంది గిరిజనుల ఇండ్లకు విద్యుత్సరఫరా చేయనున్నారు.
రూ.15.87 కోట్లతో పనులు..
జిల్లాలో రూ.15.87 కోట్లతో ఏజెన్సీలోని ప్రతి ఇంటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా కరెంట్ లేని గిరిజనుల ఇండ్లను ఆఫీసర్లు గుర్తించారు. ఇంట్లో బల్బు వెలిగేంతవరకు ఫ్రీగా విద్యుత్పరికరాలు అమర్చే విధంగా ఆఫీసర్లు ప్లాన్చేశారు. ఈ స్కీం అమలుతో జిల్లాలోని 3,159 గిరిజనుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
సర్వీస్వైర్, మీటర్, ప్లగ్ పాయింట్, అడాప్టర్, హోల్డర్తోపాటు స్విచ్బోర్డులన్నీ ఫ్రీగానే ఇవ్వనున్నారు. మార్చి నెలాఖరులోపు ఈ స్కీంను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఆఫీసర్లు ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. ఇప్పటివరకు గుర్తించిన 3,159 ఇండ్లకు 1,450 సర్వీసులకు సంబంధించి కరెంట్లైన్లను రెడీ చేశామని డీఈ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
గిరిజనుల ఇండ్లకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు..
జిల్లాలోని కరెంట్ లేని గిరిజనుల ఇండ్లకు ఫ్రీగా విద్యుత్కనెక్షన్ ఇవ్వడంతోపాటు ఇంట్లోకి బల్బు వెలిగేంతవరకు అన్ని పనులు చేపడుతున్నాం. లబ్ధిదారుడు కేవలం ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలుఇస్తే సరిపోతుంది. ఇప్పటివరకు గుర్తించిన ఇండ్లకే కాకుండా కరెంట్ సప్లై లేని గిరిజనుల ఇండ్లు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే విద్యుత్ కనెక్షన్ఫ్రీగా ఇస్తాం. - మహేందర్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, భద్రాద్రికొత్తగూడెం
