రాష్ట్రంలో కొత్త‌గా 33 కేసులు

రాష్ట్రంలో కొత్త‌గా 33 కేసులు

హైద‌రాబాద్ : రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఆదివారం కొత్త‌గా 33 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య‌శాఖ హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కి చేరుకుంద‌ని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు 751 మంది డిశ్చార్జ్ కాగా.. ఆదివారం 24 మంది డిశ్చార్జ్ అయ్యార‌ని చెప్పింది. ‌

‌ప్ర‌స్తుతం 415 మంది క‌రోనా బాధితులు హాస్పిట‌ల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నార‌ని చెప్పిన ఆరోగ్య‌శాఖ‌..రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 30 మంది చ‌నిపోయార‌ని తెలిపింది. ఇవ్వాళ న‌మోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 26 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. మ‌రో ఏడుగురు వ‌ల‌స కార్మికుల‌కు ఈ మ‌హ‌మ్మారి సోకింద‌ని వెల్ల‌డించింది రాష్ట్ర ఆరోగ్య‌శాఖ‌.