న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత గల్ఫ్ ప్రాంతంలో ఎయిర్స్పేస్ మూతపడింది. దీంతో ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీలు ఆదివారం 350 అంతర్జాతీయ విమాన సర్వీస్లను రద్దు చేశాయి. 444 సర్వీస్లు రద్దయ్యే అవకాశం ఉందని మినిస్ట్రీ ఏవియేషన్ ఎక్స్లో పేర్కొంది.
శనివారం 410 అంతర్జాతీయ విమాన సర్వీస్లు రద్దయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్లో ఆదివారం 125, ఢిల్లీలో కనీసం 100 అంతర్జాతీయ విమాన సర్వీస్లు రద్దయ్యాయి. ఢిల్లీలో 60 డిపార్చర్లు, 40 అరైవల్స్ను నిలిపేశారు.
