రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28,980 శాంపిల్స్ టెస్టు చేయగా 384 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. కరోనా బాధితుల సంఖ్య 2 లక్షల 78 వేల 108కు పెరిగింది. ఇప్పటి వరకు 14 వందల 96 మంది కరోనాకు బలయ్యారని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. రాష్టంలో 7 వేల 380 యాక్టివ్ కేసులున్నాయి. ఐసోలేషన్ లో 5 వేల 298 మంది ఉన్నారు. రాష్ట్రంలో రికవరీ రేట్ 96.8 శాతం, డెత్ రేట్ 0.53 శాతం ఉంది. ఇప్పటి వరకు 61 లక్షల 57 వేల 683 శాంపిళ్లకు పరీక్షలు నిర్వహించామన్నారు అధికారులు. కొత్త కేసుల్లో 101 జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయని చెప్పారు.

కరోనాతో ఎస్వతిని ప్రధాని మృతి