కులాంతర వివాహంపై ఆగ్రహం.. ఫ్యామిలీలో 40 మంది గుండు కొట్టించుకుని..

కులాంతర వివాహంపై ఆగ్రహం.. ఫ్యామిలీలో 40 మంది గుండు కొట్టించుకుని..

ఒకపక్క ఆధునిక ప్రపంచంలో ప్రజలు దూరాలను చెరిపేస్తోంటే.. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కులాలు, మతాలు అంటూ పట్టింపులతో బ్రతుకుతున్న ప్రజలు ఉంటూనే ఉన్నారు. కులాంతర వివాహాన్ని నేరంగా చూస్తు్న్న సమాజాలు ఇప్పటికీ మన చుట్టుపక్కలు ఉన్నాయి. అయితే తాజాగా ఒడిశాలో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

తాజాగా ఒడిశాలోని రాయగడ జిల్లాకి చెందిన ఒక అమ్మాయి వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే దీనిపై ఆగ్రహించిన ఆమె ఫ్యామిలీ శుద్ధి కర్మ కింద దాదాపు 40 మంది గుండు చేయించుకున్నారు. ఈ ఘటన కాశీపూర్ బ్లాక్‌లోని గోరఖ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బైగనగూడ గ్రామంలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. 

షెడ్యూల్డ్ తెగ నేపథ్యం ఉన్న వధువు, కుటుంబ అనుమతి లేకుండా షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవటం గ్రామస్తులలో అసంతృప్తికి కారణంగా మారిందని తేలింది. దీంతో వధువు కుటుంబంలోని మగ బంధువులు తలలు గుండు చేయించుకుని, మేకలు, కోళ్లు, పందులు వంటి జంతు బలులను వారి స్థానిక దేవతకు సమర్పించాలని గ్రామ కౌన్సిల్ నిర్ణయించింది. వాస్తవానికి రాయగడ గిరిజన సమాజం సాంప్రదాయకంగా వివిధ కులాల మధ్య వివాహాలను నిషేధించటమే దీనికి కారణంగా తెలుస్తోంది.