తెలంగాణలో 40 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు

తెలంగాణలో  40 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో 40 కొత్త పోలీస్ స్టేసన్లు ఏర్పాటు చేస్తూ జీవో రిలీజ్ చేసింది.  హైదరాబాద్‌లో 12 ఏసీపీ డివిజన్లు,  సైబరాబాద్‌లో 3 డీసీపీ జోన్లు ఏర్పాటు చేయనున్నారు.  ప్రతి జోన్‌కు ఒక మహిళా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్టు జీవోలో పేర్కొన్నారు. కొత్తగా ఆరుగురు డీసీపీలను నియమించనున్నారు. 

40 పోలీస్ స్టేషన్లలో 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.  ప్రతి ఏరియాలో సైబర్ క్రైం, నార్కోటింగ్ వింగ్ ఏర్పాటు చేయనున్నారు.  కొత్తగా 2 టాస్క్‌ఫోర్స్‌ జోన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.  

సైబరాబాద్ లో మేడ్చల్, రాజేంద్రనగర్, రాచకొండలో మహేశ్వరం జోన్ లు ఏర్పాటు  చేశారు.  హైదరాబాద్ లో   దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్‌, వారసిగూడ, బండ్లగూడ, ఐఎస్‌ సదన్‌, గుడిమల్కాపూర్,  మాసబ్‌ట్యాంక్‌, ఫిలింనగర్‌,  మధురానగర్‌, బోరబండ, సైబరాబాద్ లో మోకిల్లా, అల్లాపూర్, సూరారం, కొల్లూరు, జీనోమ్వ్యాలీ  కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.