దేశంలో కొత్తగా 4,14,188 కేసులు.. 3 ,915 మంది మృతి

దేశంలో కొత్తగా  4,14,188 కేసులు.. 3 ,915 మంది మృతి

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4 లక్షల 14 వేల 188 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 14 లక్షల 91 వేల 595 మందికి పెరిగింది. దేశంలో కరోనా ఎంట్రీ ఇచ్చాక..ఒక్క రోజులో నమోదైన కేసుల పరంగా ఇదే అత్యధికం. ప్రస్తుతం ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతలా కేసులు నమోదు కావట్లేదు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 3 వేల 915 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య  2 లక్షల 34 వేల 83కు పెరిగింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 3 లక్షల 31 వేల మంది డిశ్చార్జ్ కాగా..ఇప్పటివరకూ కోటి 76 లక్షల 12 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 36 లక్షల 45 వేల 164 యాక్టివ్ కేసులున్నాయి.