అయోధ్య రామ మందిరంలో శ్రీరామ్ రాగ సేవ

అయోధ్య రామ మందిరంలో శ్రీరామ్ రాగ సేవ

అయోధ్య (యూపీ) :  అయోధ్యలోని రాముడి ఆలయంలో 45 రోజుల పాటు ‘శ్రీరామ్ రాగ సేవ’ నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రకటించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ సేవ.. మార్చి 10 వరకు కొనసాగుతుందని వెల్లడించింది.

గర్భగుడికి ముందు ఉన్న ‘గుడి మండప్’లో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామని తెలిపింది. వంద మంది కళాకారులతో ‘శ్రీరామ్ రాగ సేవ’ నిర్వహిస్తున్నారు. హేమా మాలిని, అనూప్ జలోతా, అనురాధ పౌడ్వాల్, మాలిని అవస్థి, సోనాల్ మాన్​సింగ్​తో పాటు మరికొంత మంది కళాకారులు ఈ సేవలో భాగస్వాములు అవుతారని ట్రస్ట్ సభ్యుడు తెలిపారు.