
- 45 కిలోల సరుకు సీజ్, నిందితుడు అరెస్ట్
- పరారీలో మరో ఇద్దరు
మలక్ పేట, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న క్యాబ్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లా పెద్దకందుకూరుకు చెందిన జనపాల హరి కృష్ణ కొద్ది కాలంగా క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మహబూబ్నగర్ కు చెందిన తన ఫ్రెండ్ అరవింద్ సూచనతో.. ఒడిశాలోని సంబాల్పూర్ కు చెందిన శరత్ కుమార్ సాహు వద్ద 45 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి పెద్దకందుకూర్ కు చేరుకుని రెండు రోజులు గంజాయిని అక్కడే ఉంచాడు. అనంతరం గంజాయిని మంగళ హాట్ కు తీసుకురావాలని అరవింద్ చెప్పడడంతో సిటీకి బయలుదేరాడు. దీంతో పక్కా సమాచారంతో బుధవారం ఐఎస్ సదన్ చౌరస్తా వద్ద సౌత్ ఈస్ట్ టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి నిందితుడిని అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు కారును సీజ్చేసి స్టేషన్కు తరలించారు. ఈ కేసులో అరవింద్, శరత్ కుమార్ సాహు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వికారాబాద్: తాండూరులో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. విలేమూన్ చౌరస్తాలో నిర్వహించిన తనిఖీల్లో మహ్మద్ రఫీక్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించారు.