న్యూఢిల్లీ : రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ఈ ఏడాది సెప్టెంబర్లో 34.7 లక్షల మొబైల్ సబ్స్క్రయిబర్లను సంపాదించుకొని టెలికాం మార్కెట్లో మొదటిస్థానంలో నిలిచింది. అయితే ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 13.2 లక్షలు పెరిగిందని ట్రాయ్ వెల్లడించింది. వొడాఫోన్ఐడియా సెప్టెంబర్లో 7.5 లక్షల మంది మొబైల్ సబ్స్క్రయిబర్లను కోల్పోయింది. దాని వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 22.75 కోట్లకు తగ్గింది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం సెప్టెంబర్లో రిలయన్స్ జియో 34.75 లక్షల వైర్లెస్ సబ్స్క్రయిబర్లను పొందగా, దాని యూజర్ బేస్ 44.92 కోట్లకు చేరుకుంది. భారతి ఎయిర్టెల్ సెప్టెంబర్లో తన మొబైల్ వినియోగదారుల సంఖ్యను 37.77 కోట్లకు పెంచుకుంది. ఈ నెలలో 13.2 లక్షల మంది వినియోగదారులను చేర్చుకుంది.