తెలంగాణలో కొత్తగా 4,826 కరోనా కేసులు.. 32 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 4,826 కరోనా కేసులు.. 32 మంది మృతి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ‌. అలాగే క‌రోనాతో గ‌డిచిన 24 గంట‌ల్లో 32 మంది మృత్యువాతపడ్డారని..వైరస్‌ బారినపడిన వారిలో 7,754 మంది కోలుకున్నారని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,02,187కి చేరగా.. యాక్టివ్‌ కేసులు 62,797కు పెరిగాయని చెప్పింది. ఇవాళ్టి వరకు 2771 మంది ప్రాణాలు కోల్పోగా.. రాష్ట్రవ్యాప్తంగా సోమ‌వారం 65,923 శాంపిళ్లను పరీక్షించిన‌ట్లు వివ‌రించింది వైద్యారోగ్య‌శాఖ‌.