హోటళ్లలో ఫుడ్ పై 5 శాతం గ్యాస్ చార్జ్!

హోటళ్లలో ఫుడ్ పై 5 శాతం గ్యాస్ చార్జ్!

హైదరాబాద్​సిటీ,వెలుగు: కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా నగరంలోని పలు హోటళ్ల నిర్వాహకులు కస్టమర్ల నుంచి ప్రత్యేకంగా గ్యాస్​చార్జీలు వసూలు చేస్తున్నారు. వారం రోజులుగా సోషల్​ మీడియాలో చెన్నైలోని హోటళ్ల నిర్వాహకులు కస్టమర్ల నుంచి గ్యాస్​ చార్జీలను ప్రత్యేకంగా వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్​లోనూ కొన్ని హోటళ్ల నిర్వాహకులు అదే ఫాలో అవుతున్నారు. 

సికింద్రాబాద్​లోని ఓ ఉడిపి హోటల్​లో టిఫిన్​ సమయంలో కస్టమర్ల నుంచి మొత్తం బిల్లుపై 5 శాతం గ్యాస్​ పన్నుగా వసూలు చేస్తున్నారు. నగరంలోని మరికొన్ని హోటళ్లు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్​ పరిధిలో 50 వేల కమర్షియల్​ గ్యాస్​ కనెక్షన్​లు ఉన్నాయి. 

ప్రస్తుతం గల్ఫ్​యుద్ధం వల్ల కమర్షియల్​ సిలిండర్ల కొరత ఏర్పడింది. హోటళ్ల నిర్వాహకులు కస్టమర్లపై గ్యాస్​చార్జీగా బిల్లుపై 5 శాతం అదనంగా వసూలు చేయడంపై నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.