రోడ్డు ప్రమాదంలో.. సుశాంత్ సింగ్ బంధువులు మృతి

రోడ్డు ప్రమాదంలో.. సుశాంత్ సింగ్ బంధువులు మృతి

పాట్నా: దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. బిహార్​లోని లఖిసరాయ్​ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుశాంత్ బంధువులు ఐదుగురు చనిపోయారు. వీళ్లతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. పాట్నాలో ఓ బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి జాముయికి వస్తుండగా మంగళవారం ఉదయం ఈ విషాద ఘటన జరగింది. ‘‘సుశాంత్ బంధు వులు ప్రయాణిస్తున్న టాటా సుమో.. ఎల్పీజీ ఖాళీ గ్యాస్ సిలిండర్లతో వస్తున్న లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో డ్రైవర్​తో సహా సుమోలోని ఆరుగురు చనిపోయారు. మరో నలుగురికి గాయాలు కావడంతో ట్రీట్​మెంట్ కోసం ఆస్పత్రికి తరలించాం”అని పోలీసులు తెలిపారు.