ఏపీలో మరో 50 కొత్త కేసులు

ఏపీలో మరో 50 కొత్త కేసులు

అమరావతి: ఏపీలో మరో 50 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,831 శాంపిల్స్ టెస్టు చేయగా 50 మందికి పాజిటివ్ వచ్చిందని, ట్రీట్​మెంట్ పొందుతూ ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 73 కు పెరిగిందని ఏపీ ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. 21 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు పేర్కొంది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3427కు పెరిగాయని, ఇందులో 2294 మంది కోలుకోగా.. 1060 మంది చికిత్స పొందుతున్నారు.