
రాజస్థాన్లో 51కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 751గా నమోదైంది. ఈ విషయాన్ని ఆదివారం రాజస్థాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులలో 15మంది బన్స్ వరాకు చెందగా, ఎనిమిది మంది బికానేర్ నుంచి, చురునుంచి ఒక కేసు నమోదైందని అధికారులు చెప్పారు. దీంతో పాటు… జైపూర్లో 15కేసులు, జోధ్పూర్ నుంచి 8, సికార్నుంచి ఒకటి, హౌన్మంగర్ నుంచి ఇద్దరికి కరోనా సోకిందని తెలిపారు.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం పొద్దున వరకు దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8356 కు చేరింది. వీరిలో 716మందికి నయమవగా.. 273మంది చనిపోయారు.