గజ్వేల్‎లో 580 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గజ్వేల్‎లో 580 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గజ్వేల్, వెలుగు: రేషన్​బియ్యాన్ని సీఎంఆర్ గా మార్చేందుకు తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు దాడులు చేసి పట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.  విజిలెన్స్​ఓఎస్​డీ ప్రభాకర్​ తెలిపిన మేరకు.. మేడ్చల్ జిల్లా శామీర్​పేట మండలం తుర్కపల్లిలోని హనుమాన్​ రైస్​మిల్​యజమాని రెండు లారీల్లో  సీఎంఆర్ బియ్యం అని చెబుతూ గజ్వేల్​లోని సీఎంఆర్​గోదాములోకి తరలించారు. అవి రేషన్​బియ్యమని విజిలెన్స్​అధికారులకు సమాచారం అందింది. 

దీంతో విజిలెన్స్​ ఎన్ ఫోర్స్ మెంట్ టాస్క్​ఫోర్స్​, సివిల్​ సప్లై టీమ్స్​ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్​సీఎంఆర్​గోదాములపై దాడి చేశారు. రెండు లారీల్లోని 580 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని సీఎంఆర్  మార్చేందుకు గోదాములో నిల్వ చేస్తున్నారని గుర్తించి లారీలను సీజ్ చేశారు. ఈ దాడిలో సివిల్ సప్లై డీఎస్పీ వెంకటేశం, అధికారి రాజిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.