
గజ్వేల్, వెలుగు: రేషన్బియ్యాన్ని సీఎంఆర్ గా మార్చేందుకు తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు దాడులు చేసి పట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. విజిలెన్స్ఓఎస్డీ ప్రభాకర్ తెలిపిన మేరకు.. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లిలోని హనుమాన్ రైస్మిల్యజమాని రెండు లారీల్లో సీఎంఆర్ బియ్యం అని చెబుతూ గజ్వేల్లోని సీఎంఆర్గోదాములోకి తరలించారు. అవి రేషన్బియ్యమని విజిలెన్స్అధికారులకు సమాచారం అందింది.
దీంతో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ టాస్క్ఫోర్స్, సివిల్ సప్లై టీమ్స్ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్సీఎంఆర్గోదాములపై దాడి చేశారు. రెండు లారీల్లోని 580 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీఎంఆర్ మార్చేందుకు గోదాములో నిల్వ చేస్తున్నారని గుర్తించి లారీలను సీజ్ చేశారు. ఈ దాడిలో సివిల్ సప్లై డీఎస్పీ వెంకటేశం, అధికారి రాజిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.