చైనా…అమెరికాను మించిపోయింది

చైనా…అమెరికాను మించిపోయింది

దాదాపు అన్ని రంగాల్లో ముందుండే అమెరికాను తాజాగా చైనా ఇప్పుడు వెనక్కి నెట్టింది. ప్రపంచంలోనే 5G సేవలను వినియోగిస్తున్న తొలి జిల్లాగా షాంఘై రికార్డు సృష్టించింది. దీంతో ప్రస్తుతం 5G  సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి…. చైనా ముందడుగు వేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక పత్రిక చైనా డైలీలో తన కథనంలో తెలిపింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ చైనా మొబైల్‌ 5G  నెట్‌ వర్క్‌ ట్రయల్‌ రన్‌ను అధికారికంగా షాంఘై జిల్లాలో ప్రారంభించింది. గత మూడు నెలల కాలంలో షాంఘైలోని వివిద ప్రాంతాల్లో 5G బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా మొత్తం 5G  నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చినట్లైంది. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా షాంఘై వైస్‌ మేయర్‌ వూ క్వింగ్‌.. ప్రపంచంలోనే తొలి 5G  ఫోల్డబుల్‌ ఫోన్‌ అయిన హువాయ్‌ మేట్‌ ఎక్స్‌ నుంచి తొలి 5G  వీడియోకాల్‌ చేశారు. వినియోగదారులు తమ సిమ్‌ కార్డులను అప్‌గ్రేడ్‌ చేసుకోకుండానే ఈ సేవలను పొందవచ్చని తెలిపారు.