ఇరాక్ లో అమెరికన్ జర్నలిస్ట్ కిడ్నాప్

ఇరాక్ లో అమెరికన్ జర్నలిస్ట్ కిడ్నాప్

బాగ్దాద్: ​ఇరాక్ రాజధాని బాగ్దాద్‌‌‌‌లో అమెరికన్ జర్నలిస్టు షెల్లీ కిటిల్సన్‌‌‌‌ను మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు ఆమె పనిచేస్తున్న మీడియా సంస్థ ధ్రువీకరించింది. ఆమెను రక్షించేందుకు ఇరాక్ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు. ఇరాన్‌‌‌‌కు అనుకూలంగా ఉన్న “కతైబ్ హిజ్బుల్లా” మిలీషియా గ్రూప్ బెదిరించిందని, వారిపైనే అనుమానాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 

ఈ గ్రూప్​తో సంబంధాలున్న అనుమానితుడిని ఇరాకీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు  అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి డైలాన్ జాన్సన్ ఎక్స్​పోస్ట్​లో తెలిపారు.  మధ్యప్రాచ్యం, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలపై ప్రత్యేక రిపోర్టింగ్ చేసే కిటిల్సన్‌‌‌‌ టార్గెట్​గా కిడ్నాప్ లేదా హత్యకు కుట్ర జరుగుతుందని అమెరికా ప్రభుత్వం ముందే హెచ్చరించింది. ఆమె ఇరాక్‌‌‌‌లోనే రిపోర్టింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అమెరికా వార్తా సంస్థ ‘అల్-మానిటర్’ ఆమెను సురక్షితంగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.