మెదక్ (చేగుంట), వెలుగు : మండల కేంద్రమైన చేగుంటలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో శుక్రవారం జరిగిన మెదక్ జిల్లా స్థాయి అండర్ –15 సెమీ టాకిల్, బాలబాలికల అండర్ –18 టాకిల్ రగ్బీ పోటీలకు జిల్లాలోని నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ పోటీల్లో మంచి ప్రతిభచూపిన 64 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని కోచ్ కరణం గణేశ్ రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ స్రవంతి సతీశ్, ఉప సర్పంచ్ రఫీక్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
