ఇనుప బోల్టు మింగిన ఆరేండ్ల బాలుడు

ఇనుప బోల్టు మింగిన ఆరేండ్ల బాలుడు

ఎండోస్కోపీతో బయటకు తీసిన డాక్టర్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఆరేండ్ల బాలుడు ఆడుకుంటూ ఇనుప బోల్టు మింగాడు. డాక్టర్  ఎండోస్కోపీ చేసి బోల్టును బయటకు తీసి బాలుడి ప్రాణం కాపాడారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం హర్యాతండాలో శనివారం ఈ ఘటన జరిగింది. తండాకు చెందిన బాదావత్  రమేశ్, మంజుల దంపతుల కొడుకు హర్ష (6)  తోటి పిల్లలతో ఆడుకుంటూ శనివారం ఇనుప బోల్టు మింగాడు.

గుర్తించిన అతని తల్లిదండ్రులు.. సిటీలోని మయూరి సెంటర్​లో ఉన్న జంగాల గ్యాస్ట్రో హాస్పిటల్​కు పిల్లాడిని తీసుకెళ్లారు. డాక్టర్  జంగాల సునీల్  కుమార్  ఎండోస్కోపీ చేసి బోల్టును బయటకు తీసి బాబు ప్రాణాలు కాపాడారు.