కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఏడుగురు మృతి

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఏడుగురు మృతి

మహారాష్ట్ర థానేలోని ఉల్లాస్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఐదంతస్థుల బిల్డింగ్ స్లాబ్ కూలి ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు.మరి కొందరికి గాయాలయ్యాయి. నెహ్రూ చౌక్ వద్ద ఉన్న గ్రౌండ్-ప్లస్-ఐదు అంతస్తుల బిల్డింగ్ లోని ఐదు ఫ్లాట్ల స్లాబ్‌లు శుక్రవారం రాత్రి కూలిపోయాయి. ఏడు మృతదేహాలను బయటకు తీశారు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని NDRF బృందం రక్షించింది. వెంటనే వారిని చికిత్స కోసం సమీప హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మరణించిన వారు భవనంలో నివసిస్తున్న రెండు కుటుంబాలకు చెందినవారని గుర్తించారు. మరణించిన  ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని థానే జిల్లా సంరక్షక మంత్రి ఏకాంత్ షిండే తెలిపారు.