
హైదరాబాద్, వెలుగు : కలశ ఫైన్ జ్యుయెల్స్ ‘ఏడు వారాల నగలు’ పేరుతో తమ లేటెస్ట్ కలెక్షన్ను ప్రదర్శనకు ఉంచింది. శుక్రవారం నుంచి ఈ నెల 25 వరకు బంజారాహిల్స్ స్టోర్లో ఇవి ప్రదర్శనకు ఉంటాయి. సినీ నటి ముచ్చెర్ల అరుణ ఈ యానివర్సరీ కలెక్షన్ను శుక్రవారం లాంచ్ చేశారు. ఏడో యానివర్సరీ సందర్భంగా కలశ ఫైన్ జ్యువెల్స్ వివిధ ఆఫర్లను ప్రకటించింది. స్వర్ణకలశం సేవింగ్ స్కీమ్ తీసుకుంటే మొదటి ఇన్స్టాల్మెంట్లో 50 శాతం ఆఫర్ ఇస్తోంది. క్యారెట్ డైమండ్ను (వీవీఎస్ఈఎఫ్) రూ.55,900 కి అమ్ముతోంది. రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన కొనుగోలుపై ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది.