స్టూడెంట్​ సూసైడ్​కు కారణమైన  యువకుడికి ఏడేండ్ల జైలు

స్టూడెంట్​ సూసైడ్​కు కారణమైన  యువకుడికి ఏడేండ్ల జైలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: స్టూడెంట్​సూసైడ్​కు కారణమైన యువకుడికి ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం అడిషనల్​సెషన్స్​జడ్జి  శ్రీనివాస్​తీర్పు చెప్పారు. వెంకటాపురం మండలం నీలార్​పేటకు చెందిన స్రవంతి వెంకటాపురంలో డిగ్రీ ఫైనలియర్​చదువుతోంది. 2015 జనవరి 17న ఫీజు కట్టేందుకు తల్లి దమయంతి వద్ద డబ్బులు తీసుకుని కాలేజీకి వెళ్లింది. దారిలో ఆమెను వీరాపురం గ్రామానికి చెందిన కుమ్మరి రామకృష్ణ అడ్డుకున్నాడు. తనను ప్రేమించాలని వేధిస్తూ సెల్​ఫోన్​లాక్కున్నాడు. నీకు ఎవరితో సంబంధం ఉందో చెప్పు అంటూ కొట్టాడు. తనను పెండ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి వచ్చి పురుగుల మందు తాగింది. ట్రీట్​మెంట్​తీసుకుంటూ చనిపోయింది. స్రవంతి తల్లి వెంకటాపురం పీఎస్​లో కంప్లైట్​ఇవ్వగా సాక్షుల విచారణ తర్వాత రామకృష్ణకు ఏడేండ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి ఫైన్​ విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.