
హైదరాబాద్, వెలుగు: దోస్త్ 3వ ఫేజ్ సీట్ల కేటాయింపులో 73,662 మంది విద్యార్థులు సీట్లు పొందారు. అందులో 9,630 మంది సీట్బెటర్మెంట్కు ఆప్షన్ ఇచ్చుకోగా.. వారికీ సీట్లు దక్కాయి. దోస్త్మూడో ఫేజ్అడ్మిషన్ల వివరాలను శనివారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ప్రొఫెసర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన వెల్లడించారు. తొలి ప్రాధాన్య సీట్లను 56,731 మంది సాధించగా.. సెకండ్, థర్డ్ ఆప్షన్ కింద 16,931 మందికి సీట్లు వచ్చాయని పేర్కొన్నారు.
మొత్తంగా కామర్స్కే ఎక్కువ మంది ఆప్షన్ పెట్టుకున్నారని చెప్పారు. అత్యధికంగా 26,552 మందికి కామర్స్ సీట్లు దక్కాయి. లైఫ్సైన్సెస్లో 14,789, ఫిజికల్ సైన్సెస్లో 14,289, ఆర్ట్స్లో 11,306, డీ ఫార్మసీలో 93, ఇతర కోర్సుల్లో 6633 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 500 లేదా రూ. వెయ్యి చెల్లించి కాలేజీల్లో సీటు రిజర్వ్చేసుకోవాలన్నారు.
ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న అభ్యర్థులకు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్కు సీసీఓటీపీ వస్తుందని, ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కాలేజీలకు వెళ్లి సీసీఓటీపీని సమర్పించి సీటును ధ్రువీకరించుకోవాలని సూచించారు. కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయకుంటే సీటు కోల్పోతారని చెప్పారు. ఈ నెల 15 నుంచే డిగ్రీ క్లాసులు మొదలవుతాయ స్పష్టం చేశారు.