దోస్త్​ మూడో ఫేజ్​లో 73,662 మందికి సీట్లు

దోస్త్​ మూడో ఫేజ్​లో 73,662 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: దోస్త్​ 3వ ఫేజ్​ సీట్ల కేటాయింపులో 73,662 మంది విద్యార్థులు సీట్లు పొందారు. అందులో 9,630 మంది సీట్​బెటర్​మెంట్​కు ఆప్షన్​ ఇచ్చుకోగా.. వారికీ సీట్లు దక్కాయి. దోస్త్​మూడో ఫేజ్​అడ్మిషన్ల వివరాలను శనివారం ఉన్నత విద్యా మండలి చైర్మన్​​ప్రొఫెసర్​ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్​ దేవసేన వెల్లడించారు. తొలి ప్రాధాన్య సీట్లను 56,731 మంది సాధించగా.. సెకండ్​, థర్డ్​ ఆప్షన్​ కింద 16,931 మందికి సీట్లు వచ్చాయని పేర్కొన్నారు.

మొత్తంగా కామర్స్​కే ఎక్కువ మంది ఆప్షన్​ పెట్టుకున్నారని చెప్పారు. అత్యధికంగా 26,552 మందికి కామర్స్​ సీట్లు దక్కాయి. లైఫ్​సైన్సెస్​లో 14,789, ఫిజికల్​ సైన్సెస్​లో 14,289, ఆర్ట్స్​లో 11,306, డీ ఫార్మసీలో 93, ఇతర కోర్సుల్లో 6633 మందికి సీట్లు అలాట్​ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఆన్​లైన్​లో రూ. 500 లేదా రూ. వెయ్యి చెల్లించి కాలేజీల్లో సీటు రిజర్వ్​చేసుకోవాలన్నారు.

ఆన్​లైన్​లో సెల్ఫ్​ రిపోర్టింగ్​ చేసుకున్న అభ్యర్థులకు రిజిస్టర్డ్​ ఫోన్​ నంబర్​కు సీసీఓటీపీ వస్తుందని, ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కాలేజీలకు వెళ్లి సీసీఓటీపీని సమర్పించి సీటును ధ్రువీకరించుకోవాలని సూచించారు. కాలేజీకి వెళ్లి రిపోర్ట్​ చేయకుంటే సీటు కోల్పోతారని చెప్పారు. ఈ నెల 15 నుంచే డిగ్రీ క్లాసులు మొదలవుతాయ స్పష్టం చేశారు.