కుప్పకూలిన మూడంతస్తుల బిల్డింగ్..8 మంది మృతి

కుప్పకూలిన మూడంతస్తుల బిల్డింగ్..8 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని భివాండి నగరంలో  మూడు అంతస్థుల బిల్డింగ్ కుప్ప కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం తెల్లవారుజామున(సోమవారం) 3.20 గంటల సమయంలో పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో జరిగింది.  వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది 25 మందిని రక్షించారు.  సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇంకా 20 నుంచి 25 మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని థానే మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది . 1984 లో నిర్మించిన ఈ జిలానీ అపార్ట్ మెంట్ -69 లో దాదాపు 21 ఫ్లాట్స్ ఉన్నాయి.