టీఎస్‌‌పీఎస్సీ కేసులో మరో 8 మందికి బెయిల్‌‌

టీఎస్‌‌పీఎస్సీ కేసులో మరో 8 మందికి బెయిల్‌‌

టీఎస్‌‌పీఎస్సీ కేసులో మరో 8 మందికి బెయిల్‌‌

హైదరాబాద్, వెలుగు : టీఎస్‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో మరో 8 మందికి బెయిల్‌‌ మంజూరయ్యింది. నీలేశ్ నాయక్‌‌, గోపాల్‌‌నాయక్‌‌, మాజీ కానిస్టేబుల్‌‌ శ్రీనివాస్, రాజేందర్ నాయక్‌‌, టీఎస్‌‌పీఎస్సీ మాజీ ఉద్యోగి షమీమ్‌‌, సురేశ్, ప్రశాంత్​రెడ్డి, తిరుపతయ్యలకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు రూ.50 వేల పూచికత్తు, ఇద్దరిని ష్యూరిటీస్ ఇవ్వాలని ఆదేశించింది.

సిట్‌‌ ముందు విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో రేణుక, దాసరి రమేశ్​కు బెయిల్ మంజూరైంది. దీంతో ప్రధాన నిందితులు ప్రవీణ్‌‌ కుమార్‌‌‌‌, రాజశేఖర్‌‌‌‌రెడ్డితో పాటు ఢాక్యానాయక్‌‌, రాజేశ్వర్‌‌ కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం విచారణ జరగనుంది.