టీఎస్పీఎస్సీ కేసులో మరో 8 మందికి బెయిల్
హైదరాబాద్, వెలుగు : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో మరో 8 మందికి బెయిల్ మంజూరయ్యింది. నీలేశ్ నాయక్, గోపాల్నాయక్, మాజీ కానిస్టేబుల్ శ్రీనివాస్, రాజేందర్ నాయక్, టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి షమీమ్, సురేశ్, ప్రశాంత్రెడ్డి, తిరుపతయ్యలకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు రూ.50 వేల పూచికత్తు, ఇద్దరిని ష్యూరిటీస్ ఇవ్వాలని ఆదేశించింది.
సిట్ ముందు విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో రేణుక, దాసరి రమేశ్కు బెయిల్ మంజూరైంది. దీంతో ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్రెడ్డితో పాటు ఢాక్యానాయక్, రాజేశ్వర్ కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం విచారణ జరగనుంది.