జనగామ, వెలుగు : సర్ 2026 ప్రకియపై జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్ఐఆర్ఇన్చార్జి భాస్కర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఎల్ఏలు మాట్లాడుతూ ఇప్పటివరకూ 8 వేల ఓట్లను గుర్తించామని, సర్ ప్రక్రియ పూర్తయ్యేనాటికి డూప్లికేట్, మృతి చెందిన వారివి మరో రెండు వేల ఓట్లు గుర్తించే అవకాశముందని తెలిపారు. సర్ ప్రక్రియలో బీఎల్వోలు పూర్తిగా వైఫల్యం చెందారని వివరించారు.
ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను కొందరు బీఎల్వోలు తిరిగి తీసుకెళ్లడం లేదన్నారు. తీసుకెళ్లిన ఫారాలను డిజిటలైజేషన్ చేయడం లేదని, తామే వాటిని చేస్తున్నామని బీఎల్ఏలు వివరించారు. కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి మాట్లాడుతూ హైదరాబాద్లో నివాసం ఉంటూ ఇక్కడే ఓటర్లుగా ఉండాలనుకునే వారి అడ్రస్లు సేకరించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు.
