హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ పీజీఈసెట్- శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు 88 శాతం మంది హాజరయ్యారు. కాగా, మార్నింగ్ సెషల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు జరిగాయి. మొత్తం 3,539 మంది విద్యార్థులకు గానూ 3,084 మంది(87.14 శాతం) అటెండ్అయ్యారు.
మధ్యాహ్నం సెషన్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షను10,045 మందికి గానూ 8,972 మంది(89.32 శాతం) రాశారు. హైదరాబాద్, వరంగల్ సెంటర్లలో పరీక్షలు సజావుగా జరిగాయని పీజీఈసెట్ కన్వీనర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. పరీక్షలను టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రెక్టార్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి తదితరులు పర్యవేక్షించారు.
