ముంబై : మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన రెంరో రోజు కొనసాగుతోంది. తిరుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం (జూన్ 22న ) శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఇంటి వద్ద ఒక బ్యానర్ వెలిసింది. ‘మీ అహంకారం 4 రోజులే ఉంటుంది. మా రాజ్యం వారసత్వంగా వచ్చింది’ అని అందులో ఉంది.
Maharashtra | A banner, reading 'Your arrogance would last 4 days, our kingship is inherited', seen outside the residence of Shiv Sena leader Sanjay Raut in Mumbai.
— ANI (@ANI) June 22, 2022
The banner has been put up by Shiv Sena Corporator Deepmala Badhe. pic.twitter.com/N4WkJA0riB
ఫ్లెక్సీలో ఉన్న ఈ కామెంట్స్ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి హెచ్చరించి ఉన్నాయని తెలుస్తోంది. శివసేన కార్పొరేటర్ దీప్మలా బాధే ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో ఆ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే, బాలసాహేబ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్తోపాటు ఇతర శివసేన ప్రముఖుల ఫొటోలు ఉన్నాయి.