‘మీ అహంకారం 4 రోజులే’..  సంజయ్‌ రౌత్‌ ఇంటి వద్ద ఫ్లెక్సీ

‘మీ అహంకారం 4 రోజులే’..  సంజయ్‌ రౌత్‌ ఇంటి వద్ద ఫ్లెక్సీ

ముంబై : మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన రెంరో రోజు కొనసాగుతోంది. తిరుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం (జూన్ 22న ) శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇంటి వద్ద ఒక బ్యానర్‌ వెలిసింది. ‘మీ అహంకారం 4 రోజులే ఉంటుంది. మా రాజ్యం వారసత్వంగా వచ్చింది’ అని అందులో ఉంది.

ఫ్లెక్సీలో ఉన్న ఈ కామెంట్స్ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి హెచ్చరించి ఉన్నాయని తెలుస్తోంది. శివసేన కార్పొరేటర్ దీప్మలా బాధే ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో ఆ పార్టీ చీఫ్‌, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, బాలసాహేబ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్‌ రౌత్‌తోపాటు ఇతర శివసేన ప్రముఖుల ఫొటోలు ఉన్నాయి.