మద్యం మత్తులో యువకుల కార్ డ్రైవింగ్, ఒకరికి స్వల్ప గాయాలు 

మద్యం మత్తులో యువకుల కార్ డ్రైవింగ్, ఒకరికి స్వల్ప గాయాలు 

జగిత్యాల పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. కారు లో ఉన్న ముగ్గురు వ్యక్తులు పూటుగా మద్యం సేవించి ర్యాష్ గా డ్రైవింగ్ చేశారు. అతివేగంతో కారును డ్రైవింగ్ చేస్తూ బస్ స్టాండ్ వద్ద బైక్ పై ఉన్న ఇద్దరిని ఢీ కొట్టారు.వారికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. అక్కడే ఉన్న స్థానికులు కారును ఆపే ప్రయత్నం చేశారు. కానీ మద్యం మత్తులో ఉన్న యువకులు కారును స్పీడ్ గా బస్టాండ్ ఆవరణలోని తీసుకెళ్లారు. అక్కడ మరో ఇద్దరు ప్రయాణికులను ఢీ కొట్టారు.  ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.

బస్టాండ్ ఆవరణలో కారును వదిలేసిన అక్కడి నుంచి ముగ్గురు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును పీఎస్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.