భువనగిరి డంపింగ్ ​యార్డులో కూలిన శిలాఫలకం.. పదేండ్ల పాప మృతి

భువనగిరి డంపింగ్ ​యార్డులో కూలిన శిలాఫలకం.. పదేండ్ల పాప మృతి
  • భువనగిరి డంపింగ్ ​యార్డులో కూలిన శిలాఫలకం 
  • పదేండ్ల పాప మృతి
  • మూడేండ్ల చిన్నారికి గాయాలు 

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ డంపింగ్​యార్డులో చెత్త ఆటో ఢీకొనగా శిలాఫలకం మీద పడి ఓ చిన్నారి చనిపోయింది. తమిళనాడుకు చెందిన కార్బన్​ డైనమిక్స్​ అనే ఏజెన్సీ ఇటీవలే భువనగిరి డంపింగ్​ యార్డులో చెత్తను వేరు చేసే పనిని చేపట్టింది. ఇక్కడ పనులు చేయడానికి  అసోం నుంచి రెండు కుటుంబాలను భువనగిరికి రప్పించారు. ఇందులో  అశ్ర,​ అలీ దంపతులు ఇద్దరు ఆడపిల్లలతో వచ్చారు. వీరు డంపింగ్​యార్డులోనే ఉంటున్నారు.

కాగా, గురువారం శంకుస్థాపన టైంలో వేసిన శిలాఫలకం వెనుక పిల్లలు ఆడుకుంటున్నారు. అదే టైంలో చెత్త ఆటో రివర్స్​తీస్తూ శిలాఫలకాన్ని ఢీకొట్టగా అది కూలింది. దీంతో పిల్లలపై పడగా అప్సాన అహ్మద్​(10) అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన మునీర్​ మరియ​(3)ను గాంధీ హాస్పిటల్​కు తరలించారు. ఆటో డ్రైవర్​సురేశ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.