గొంతులో గోళి ఇరుక్కుని చిన్నారి మృతి

గొంతులో గోళి ఇరుక్కుని చిన్నారి మృతి

కోరుట్ల: సీసపు గోళి గొంతులో ఇరుక్కుపోయి ఓ చిన్నా రి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన శనివారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని పోచమ్మ వీధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల రవిరాజు మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. శనివారం కొడుకు అభియంత్(11 నెలలు)ఇంటి ఆవరణలో పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సీసపు గోళి మింగాడు. అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక ఏడ్చాడు. కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ పిల్లల హాస్పి టల్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జగిత్యాల తీసుకువెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.