- నేడు, రేపు భారీ చేరికలకు ప్లాన్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర కాంగ్రెస్ లో బుధవారం ముగ్గురు సభ్యులతో కూడిన చేరికల కమిటీ ఏర్పాటైంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డిలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ లో చేరికల అంశాన్ని ఈ ముగ్గురే చూసుకోనున్నట్లు
పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ..ఈ నెల 25, 26 తేదీల్లో గాంధీ భవన్ వేదికగా భారీ చేరికలు ఉంటాయని వెల్లడించాయి. కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల పూర్తి విశ్వాసం, విధేయత ఉన్న వారినే పార్టీలో చేర్చుకోవాలని హైకమాండ్ ఆదేశించినట్ల పేర్కొన్నాయి.