గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ 59వ డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్అభ్యర్థి బాలసాని తిరుపతిగౌడ్ రెండు ఓట్ల మెజార్టీతోనే విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఖాజా సనాకు 768 ఓట్లు రాగా, తిరుపతికి 770 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఖాజా సనా చేసిన విజ్ఞప్తికి రీ కౌంటింగ్ చేశారు. అయినా మళ్లీ రెండు ఓట్ల తేడా వచ్చింది. అయినా మొత్తం మూడు సార్లు కౌంటింగ్ చేసి చివరకు తిరుపతి గౌడ్ గెలిచినట్టు రిటర్నింగ్ ఆఫీసర్ప్రకటించారు.
అలాగే రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ నుంచి ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పర్లపల్లి పుష్పలీల నాలుగు ఓట్ల తేడాతో గెలిచారు. ఆమెకు 954 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి శనిగరపు శారద(కాంగ్రెస్)కు 950 ఓట్లు వచ్చాయి. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో 38వ డివిజన్ నుంచి నెలకంటి రాము(కాంగ్రెస్) అత్యధికంగా 1,048 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాముకు 1720 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి హర్షవర్ధన్కు 672 ఓట్లు మాత్రమే వచ్చాయి.
