ఇసుక కోసం రెండు గ్రామాల మధ్య కొట్లాట

ఇసుక కోసం రెండు గ్రామాల మధ్య కొట్లాట

మాచారెడ్డి: ఇసుక వివాదం రెండు జిల్లాల సరిహద్దు గ్రామాల మధ్య  ఉద్రిక్తత సృష్టించింది. కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, ఘన్పూర్ గ్రామం.. రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట్ మండలం, గోరంటాలకు మధ్యలోని వాగు నుంచి ఇసుక తరలిస్తున్నారు. అయితే ఇసుక తమ పరిధిలోకి వస్తుందంటూ రెండు గ్రామాల ప్రజలు కొట్లాడుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాచారెడ్డి, గంభీరావుపేట్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు సీజ్ చేసి మాచారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

మరిన్ని వార్తల కోసం:

గుంటూరు కలెక్టర్‌‌‌‌గా నితిన్!

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

ఉత్తరాఖండ్​లో యూనిఫామ్ సివిల్ కోడ్