వనస్థలిపురంలో భూ తగాదా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

వనస్థలిపురంలో భూ తగాదా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో భూవివాదంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.  స్థానికంగా ఉండే జక్కిడి సంజీవరెడ్డి, ప్లాటు ఓనర్ శరత్ కుమార్ మధ్య  గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.

వనస్దలిపురంలోని సహెబ్ నగర్ లోని రైతు దగ్గర నుంచి 4 ఎకరాల భూమి మధ్యవర్తి జిపిఏ చెసుకున్నాడు.ఆ నాలుగు ఎకరాల భూమితో పాటు పక్కనే ఉన్న సంజీవ రెడ్డికి చెందిన కొంత భూమిని కలుపుకొని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ చేసి1997లో ఐదు ప్లాట్లు అమ్ముకున్నాడు.  ఆ ఐదు ప్లాట్లలో శరత్ అనే వ్యక్తికి ఒక ఫ్లాట్ ఉంది. సంజీవరెడ్డి తన వ్యవసాయ పొలంలో ఖాళీగా ఉన్న ఆ ప్లాట్ల భూమిని కలుపుకొని చాలా రోజుల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్లాట్ నాది అని శరత్ అనే వ్యక్తి రౌడీలతో బెదిరిస్తున్నారని సంజీవరెడ్డి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.