రెండు కార్లు ఢీ - ఐదుగురు మృతి : నిర్లక్ష్యం ఎవరిదీ..?

రెండు కార్లు ఢీ - ఐదుగురు మృతి : నిర్లక్ష్యం ఎవరిదీ..?

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం జెక్లేర్ గ్రామ సమీపంలో రెండు కార్లు ఢీకొని ఐదు మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.

విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశా రాష్ట్రం కటక్ జిల్లాకు చెందిన కసంత్ కుమార్ నేవీ ఉద్యోగి. విశాఖపట్నంకు ట్రాన్స్ ఫర్ అయ్యింది. దీంతో తన కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నంకు వెళ్తుండగా.. మరో కారు హైదరాబాద్ నుండి కర్ణాటకలోని సైదాపూర్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.