మేడ్చల్ జిల్లాలో పేలిన సిలిండర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మేడ్చల్ జిల్లాలో పేలిన సిలిండర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని అద్రాస్ పల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇంటిలోని సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లోని సామాన్లు ఖాళీపోయాయి. ఇంటి యజమాని భాస్కర్, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గుర్తించి వెంటనే ఇంట్లో వారందరూ బయటకు పరుగులు పెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే గ్రామస్తులు భాస్కర్ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రమాదం గురించి ఆరా తీశారు. 

ప్రమాదానికి దగ్ధమైన ఇంటిని వాటర్ ట్యాంక్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సిలిండర్ మారుస్తుండగా.. రెగ్యులేటర్ సరిగా బిగించకపోవడంతోనే ఒక్కసారిగా మంటలు చెలరేగి.. సిలిండర్ బ్లాస్ట్ అయ్యిందని చెబుతున్నారు.