సెక్రటేరియట్ ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ ల బృందం

సెక్రటేరియట్ ను సందర్శించిన  ట్రైనీ ఐఏఎస్ ల బృందం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ ల బృందం బుధవారం సెక్రటేరియట్ ను సందర్శించింది. సెక్రటేరియట్ పనితీరును మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ట్రైనీ ఐఏఎస్ లకు వివరించారు. పట్టణ ప్రగతి గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. 

కార్యక్రమంలో అడిషనల్ సెక్రటరీ సైదా, వెంకటేశ్వర్లు, డిప్యూటీ సెక్రటరీ లక్ష్మినారాయణ, ఎంసీఆర్ హెచ్ ఆర్డీ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.