వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం : టైర్ల కంపెనీలో మంటలు

వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం : టైర్ల కంపెనీలో మంటలు

హైదరాబాద్ : వనస్థలిపురం ఆటోనగర్ లోని టైర్ల బాటనింగ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలతో స్థానికులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విషయం తెలియగానే సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకుని.. మంటలను ఆర్పివేశారు. టైర్ల రీబటన్ కంపెనీతో పాటు గోదాంలోనూ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.20 లక్షల విలువ చేసే టైర్లు మంటల్లో కాలిపోయాయని చెబుతున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాణ నష్టం కూడా జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.