పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఆర్ వీ పోలిమర్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలో రియాక్టర్ పేలి.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఘటనాస్థలంలో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. 

ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తోటి సిబ్బంది అంబులెన్స్ లో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అగ్నిప్రమాదం గురించి  తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది.  4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.