చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. హైకోర్టు వద్ద ఓ యవకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గేట్ నెంబర్ 6 సమీపంలో ఉన్న సులబ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న మిథున్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై దుండగుడు హత్య చేశాడు. జనం చూస్తుండగానే కత్తితో పొడిచాడు.
అనంతరం పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు. రూ. 10 వేల విషయంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.