హైదరాబాద్, వెలుగు: రన్నింగ్ ట్రైన్ నుంచి పడి ఓ వ్యక్తి తన రెండు కాళ్లు కోల్పోయాడు. నాంపల్లి జీఆర్ పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్తాండూరు పరిధిలోని కరణ్కోట్కి చెందిన బసవరాజు(38) సోమవారం వికారాబాద్ నుంచి ట్రైన్లో నాంపల్లి వస్తున్నాడు. రాత్రి 8గంటల తర్వాత ట్రైన్ఫతేనగర్ ఎంఎంటీఎస్ స్టేషన్ సమీపంలోకి వస్తోంది. ఫుట్బోర్డు మీద కూర్చొని ఉన్న బసవరాజు ట్రైన్నుంచి ఒక్కసారిగా కిందపడిపోయాడు. రెండు కాళ్లు ట్రైన్కిందపడడంతో పూర్తిగా విరిగిపోయాయి. ఈ ఘటన సనత్నగర్, ఫతేనగర్రెండు స్టేషన్ల మధ్య జరగడంతో ఎవరూ గమనించలేదు. దాదాపు 2 గంటల పాటు పట్టాల మీదే నరకం అనుభవించాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గుర్తించి108కి కాల్ చేశారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసిన
బాధితుడిని గాంధీ హాస్పిటల్కి తరలించారు.