రన్నింగ్​ ట్రైన్​ నుంచి పడి కాళ్లు కోల్పోయిండు

రన్నింగ్​ ట్రైన్​ నుంచి పడి కాళ్లు కోల్పోయిండు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రన్నింగ్ ట్రైన్ నుంచి పడి ఓ వ్యక్తి తన రెండు కాళ్లు కోల్పోయాడు. నాంపల్లి జీఆర్ పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్​తాండూరు పరిధిలోని కరణ్​కోట్​కి చెందిన బసవరాజు(38) సోమవారం వికారాబాద్‌‌‌‌ నుంచి ట్రైన్​లో నాంపల్లి వస్తున్నాడు. రాత్రి 8గంటల తర్వాత ట్రైన్​ఫతేనగర్ ఎంఎంటీఎస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ సమీపంలోకి వస్తోంది. ఫుట్​బోర్డు మీద కూర్చొని ఉన్న బసవరాజు ట్రైన్​నుంచి ఒక్కసారిగా కిందపడిపోయాడు. రెండు కాళ్లు ట్రైన్​కిందపడడంతో పూర్తిగా విరిగిపోయాయి. ఈ ఘటన సనత్​నగర్, ఫతేనగర్​రెండు స్టేషన్ల మధ్య జరగడంతో ఎవరూ గమనించలేదు. దాదాపు 2 గంటల పాటు పట్టాల మీదే నరకం అనుభవించాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గుర్తించి108కి కాల్‌‌‌‌ చేశారు. జీఆర్‌‌‌‌‌‌‌‌పీ పోలీసులు కేసు నమోదు చేసిన 
బాధితుడిని గాంధీ హాస్పిటల్‌‌‌‌కి తరలించారు.