హైదరాబాద్ సిటీలో సైకిళ్ల దొంగలు

హైదరాబాద్ సిటీలో సైకిళ్ల దొంగలు

హైదరాబాద్ దొంగలు ఎక్కువైపోయారు.  డబ్బులు, బంగారం, బైకులు మాత్రమే కాదు సైకిళ్లను కూడా వదలడం లేదు.  మోడ్రన్ లుక్ లో కొత్త సైకిళ్లు కంటపడితే చాలు  కొట్టేస్తున్నారు.  ఇటీవల  రూ.85 వేల విలువైన 11 సైకిళ్లను దొంగిలించిన వ్యక్తిని శాలిబండ పోలీసులు 2024 మార్చి 19వ తేదీ మంగళవారం  రోజున అరెస్టు చేశారు. 

మార్చి 15 వ తేదీన షాహలిబండలోని సల్మాన్ జియం సమీపంలో ఉన్న తన ఇంటిలోని రూ. 35వేల విలువైన  సైకిల్ మిస్ అయినట్లుగా  మొహమ్మద్ అజీమ్ ఖాన్‌ అనే వ్యక్తి మార్చి 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్నారు. 

 అతని వద్ద నుంచి రూ.85,000/- విలువ చేసే 11 సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని జైలుకు తరలించారు.   జల్సాలకు అలవాటుపడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల విచారణలో దొంగ ఒప్పుకున్నాడు.